లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం
దమ్మపేట,(విజయక్రాంతి): కార్మిక చట్టాలను అమలు చేయకుండా పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా కార్మిక చట్టాలను సవరించి నూతన లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని, వెంటనే లేబర్ కోడ్ లును రద్దు చేయాలని, లేబర్ కోడ్ ల రూల్స్ గెజిట్ ప్రతులను ఆదివారం ఎస్బీఐ సెంటర్లో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ మాట్లాడుతూ... కేంద్ర బిజెపి ప్రభుత్వం తీసుకు వస్తున్న నాలుగు కార్మిక లేబర్ కోడ్ లు దేశ కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తుందని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే ఈ నిబంధనలను నోటిఫై చేసిందని, లేబర్ కోడ్ లు రద్దయ్యేంతవరకు అలుపెరగని ఉద్యమాలు నిర్వహించవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ మురహరి రఘు, కోటేశ్వరరావు, ధర్మ, కార్తీక్, ప్రసాద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.






