13 May, 2026 | 11:42 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

10-05-2026 01:59 PM

హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ నగరంలోని ములుగు రోడ్డులో గల మాలిక్ కియా షోరూంలో కియా సంస్థ రూపొందించిన సరికొత్త మోడల్ 'కియా సైరోస్'  కారును హనుమకొండ డీసీసీ అధ్యక్షులు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇనగాల కారు ఫీచర్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, గరిష్ట భద్రతా ప్రమాణాలతో కూడిన వాహనాలను సామాన్యులకు సైతం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆయన అన్నారు. కియా సైరోస్ కారు వినియోగదారులకు మంచి అనుభూతిని అందిస్తుందని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ నవీన్, మహేష్,విజయ్ తదితరులు పాల్గొన్నారు.