10 March, 2026 | 3:45 PM

భారీగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు.. అర్థరాత్రి నుంచే అమలు

10-03-2026 12:59 PM

కొలంబో: ప్రపంచ ముడి చమురు ధరలు(World crude oil prices) పెరుగుతున్న నేపథ్యంలో హోర్డింగ్, భయాందోళనలను అరికట్టే ప్రయత్నంలో శ్రీలంక( Sri Lanka) సోమవారం అర్ధరాత్రి నుండి రిటైల్ ఇంధన ధరలను 8 శాతానికి పైగా పెంచిందని అధికారులు మంగళవారం తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగిన తర్వాత నాలుగు సంవత్సరాలలో మొదటిసారిగా ప్రపంచ ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లు దాటినందున ధరల పెంచినట్లు అధికారులు సూచించారు. తాజా సవరణ ప్రకారం, విస్తృతంగా ఉపయోగించే పెట్రోల్, డీజిల్ రకాల ధరలను లీటరుకు LKR 22 పెంచినట్లు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (Ceylon Petroleum Corporation) తెలిపింది. పాకిస్థాన్ ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. లీటరుకు రూ.55 పెంచుతూ పాకిస్థాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

శ్రీలంకలో అర్ధరాత్రి నుంచి ఇంధన ధరలు

ఆక్టేన్ 92 పెట్రోల్ రూ.24 పెంపు, ప్రస్తుతం లీటర్ రూ.317

ఆక్టేన్ 95 పెట్రోల్ రూ.25 పెంపు, ప్రస్తుతం లీటర్ రూ.365..

ఆటో డీజిల్ రూ.22 పెంపు, ప్రస్తుతం లీటర్ రూ.303..

సూపర్ డీజిల్ రూ.24 పెంపు, ప్రస్తుతం లీటర్ రూ.353..

కిరోసిన్ రూ.13 పెంపు, ప్రస్తుతం లీటర్ రూ.195..