4 May, 2026 | 3:10 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

మంథని వైపు మరలిన పెద్దపులి

26-12-2025 10:07 PM

ఎల్ మడుగు గోదారి దాటి ఆరెంద అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: అటవీశాఖ అధికారులు

మంథని,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని వైపు పెద్దపులి మారిలింది. మంథని మండలంలోని ఎల్.మడుగు గోదారి నది దాటి ఆరెంద అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నదని అటవీ శాఖ అధికారులు తెలిపారు.  పెద్దపులి ఇప్పటికే మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓసిపి దాటి ఎన్టిపిసి ఏరియాలో సంచరించిన పెద్దపులి, ఆ తర్వాత మళ్లీ చెన్నూరు అడివి ప్రాంతాల్లోకి వెళ్ళింది.

శుక్రవారం చెన్నూరు ప్రాంతం నుంచి మంథని మండలంలోని గోదావరి నది దాటి ఆరెంద అటవి ప్రాంతంలో సంచరిస్తున్న పులి అడుగులను గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు,  రైతులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళలో బయట తిరగవద్దని, పశువులను అటవీ ప్రాంతంలోకి పంపించవద్దని అటవీశాఖ అధికారులు సూచించారు.