20 June, 2026 | 3:35 PM

Breaking News

రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •   మండల ఉపసర్పంచుల ఫోరం   •  

సామాన్యుడు ప్రశ్నించేలా ఆర్జీఐ చట్టం: పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్

12-10-2025 01:22 PM

హైదరాబాద్: దూరదృష్టితో యూపీఏ ప్రభుత్వం సమాచార హక్కుల చట్టం తీసుకొచ్చిందని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. పాలనలో పారదర్శకతను తీసుకురావడమే సమాచార హక్కు చట్టం ముఖ్య లక్ష్యమన్నారు. పాలనలో ఎవరైనా తప్పు చేస్తే సామాన్యుడు ప్రశ్నించేలా ఆర్జీఐ చట్టం తీసుకొచ్చామని, గొప్ప చట్టాలు తీసుకొచ్చి ప్రజలకు సంపూర్ణమైన హక్కులను యూపీఏ ప్రభుత్వం కల్పించిందని మహేష్ గౌడ్ వెల్లడించారు.

కాంగ్రెస్ తీసుకొచ్చే గొప్ప చట్టాలను ఏన్డీయే ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. ఆర్టీఐ చట్టానికి సవరణలు చేసి దాని స్వతంత్రను బలహీన పరిచారని, ఆర్టీఐ కమీషనర్ పదవీకాలం, జీతభత్యాలను కేంద్రమే నిర్ణయించేలా సవరణలు చేశారని ఆయన వివరించారు. వాస్తవాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే ప్రాణాలు తీస్తామని బెదిరించారని మండిపడ్డారు. కేంద్రంలో 11 మంది ఆర్టీఐ కమిషనర్లు ఉండాల్సిన చోట ఇద్దరే ఉన్నారని, ఆర్జీఐని నీరుగార్చేందుకు కమిషనర్ పోస్టులను భర్తీ చేయట్లేదని పీసీసీ చీఫ్ మండిపడ్డారు.