22 July, 2026 | 9:35 PM

ప్లాస్టిక్ దుకాణాలపై అధికారుల దాడులు

22-07-2026 08:31 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా ప్లాస్టిక్ విక్రయిస్తున్న దుకాణాలపై మున్సిపల్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. సింగిల్ యూస్ ప్లాస్టిక్ అమ్ముతున్న దుకాణాలకు జరినామ విధించారు. ప్లాస్టిక్ను విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని తెలిపారు. పేపర్ బ్యాగులు అమ్ముకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవి బాబు సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ రజిని మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు