11 May, 2026 | 12:59 PM

Breaking News

బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •  

10 వరకు అభ్యంతరాల స్వీకరణ

07-01-2026 12:45 AM

జగిత్యాల, జనవరి 6 (విజయ క్రాంతి ఎన్నిక): ముసాయిదా ఓటర్ జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల10 వ తేది లోపు వ్రాత పూర్వకంగా తెలపాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ కోరారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీల పరిధీలలో ప్రకటించిన ఓటర్ల జాబితాపై రాజకీయ పార్టీ   మున్సిపల్ ఎన్నికల రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం కలెక్టరేట్ లో సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మూసాయిదా ఓటర్ల జాబితాలో వచ్చిన అభ్యంతరాలను, పొలిటికల్ పార్టీ నాయకులు లేవనెత్తిన అంశాలను క్షేత్ర స్థాయిలో పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ప్రధానంగా ఒకే కుటుంబానికి చెందిన వారి పేర్లు వేరువేరు వార్డుల్లో ఉండటం, విలీన గ్రామాల్లోని వారందరినీ ఒకే వార్డులో ఉంచకపోవడం, పట్టణంలో ఒకే ప్రాంతానికి చెందిన వారిని రెండు, అంతకంటే ఎక్కువ వార్డుల్లోకి మార్చడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని తెలిపారు.

వీటిపై మున్సిపల్ కమిషనర్ లు క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని పొలిటికల్ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమం లో జిల్లా అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, మున్సిపల్ కమిషనర్ లు, పొలిటికల్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.