10 April, 2026 | 3:19 PM

Breaking News

ఉపాధి హామీ పనులు వేసవిలో ఉదయం పూట చేసుకోవాలి   •   'ఇజ్రాయెల్ ఒక క్యాన్సర్ దేశం' — పాకిస్థాన్ రక్షణ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు   •   క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు   •   ఫార్మా కంపెనీలో గాయపడిన కార్మికులకు అండగా ఉంటాం   •   అమెరికా, ఇరాన్ శాంతి చర్చలపై కమ్ముకున్న నీలినీడలు   •   తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •  

22, 24వ వార్డుల్లో పోషక పక్వాడ

10-04-2026 12:19 AM

ఇల్లందు టౌన్ ఏప్రిల్ 9 (విజయక్రాంతి): ఇల్లందు పట్టణం 22, 24వ వార్డుల్లో నిర్వహించిన పోషక పక్వాడ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్లు కొర్లపాటి శివ కిరణ్, శనిగారపు శృతి పాల్గొని మాట్లాడారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులు పోషకాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారన్నారు. 

రక్తహీనత, పోషకాహార లోపం నివారణకు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు, పిల్లల ఎదుగుదలలో సమతుల్య ఆహారం, శుభ్రత ముఖ్యమని తెలిపారు. కార్యక్రమంలో సూపర్వైజర్ ధనలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు సక్కుబాయి, సరస్వతి, అరుణకుమారి, ఆశా వర్కర్ కరుణ తదితరులు పాల్గొన్నారు.