15 June, 2026 | 2:27 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

డ్రైనేజీపై షాపులు నిర్మించిన యజమానులకు నోటీసులు

12-06-2026 07:01 PM

దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట గ్రామ పంచాయతీ పరిధిలోని శిథిలావస్థకు చేరిన ఇండ్ల యజమానులు, ఖాళీ స్థలాల యజమానులు జూన్ 14వ తేదీలోపు వాటిని శుభ్రం చేయించాలని తెలిపారు. అదేవిధంగా కొంత మంది షాపుల యజమానులు డ్రైనేజీపై శాశ్వత నిర్మాణాలు చేసి రోడ్డుపైనే వ్యాపారాలు నిర్వహిస్తున్నారని వారు కూడా జూన్ 14వ తేదీలోపు ఖాళీ చేసి ప్రత్యామ్నాయం చూసుకోవాలని, లేనియెడల పంచాయతీ రాజ్ చట్ట ప్రకారం చర్యలు చేపడతామని కార్యదర్శి బండి అనంత్ కుమార్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. దీంతో నోటీసులు అందుకున్న షాపుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.