calender_icon.png 21 February, 2026 | 10:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త సినిమాకు శ్రీకారం

21-02-2026 01:50:46 AM

‘మా ఊరి ప్రేమకథ’ చిత్రంతో హీరోగా పరిచయమైన మంజునాథ్. ఇప్పుడు ‘రౌడీ విక్రమ్’, ‘పక్కా ప్రేమికుడు’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉండగానే మంజునాథ్ కథానాయకుడిగా మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి క్రియేషన్స్ పతాకంపై వీ లక్ష్మీదేవి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నూతన దర్శకుడు అభిరామ్ గంటా తెరకెక్కిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.  ఈ సందర్భంగా హీరో మంజునాథ్ మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో నేను ప్యాషన్ డిజైనర్ క్యారెక్టర్‌లో నటిస్తున్నా. అవుట్ అండ్ అవుట్ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది” అన్నారు.

‘ఈ సినిమాలో లవ్, కామెడీ, సస్పెన్స్, ఎమోషన్, ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉంటాయ’ని దర్శకుడు అభిరామ్ చెప్పారు. నిర్మాత లక్ష్మీదేవి మాట్లాడుతూ.. “చిత్రంలో హీరో మంజునాథ్ సరసన ప్రముఖ హీరోయిన్ నటించనుంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం” అని తెలిపారు.