17 June, 2026 | 8:46 PM

Breaking News

కామారెడ్డి జిల్లా ఒలంపిక్ డే రన్ 2026 చైర్మన్ గా డా.యం.జైపాల్ రెడ్డి   •   బోర్వెల్ బండి బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు   •   ఇంజన్‌లో లోపం.. అగ్నికి ఆహుతైన కారు   •   20 వ ఏరియా లెవెల్ ట్రైపాయిటెడ్ మీటింగ్ లో పాల్గొన్న ఎండి రజాక్   •   సాంకేతిక, విద్య, ఉపాధి, అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి   •   శాసనసభ్యులు వెడుమ బొజ్జు పటేల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు   •   తన పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు   •   సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి   •   మొద్దులగూడెం గ్రామంలో సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ   •   గ్రామానికి వైద్యుని స్వర్ణ వ్రతం బహుకరణ   •  

గుండ్లపోచంపల్లి మున్సిపల్ పట్టణంలో నషా ముక్త్ భారత్ అలియాస్ కార్యక్రమం

19-11-2025 01:02 AM

మేడ్చల్ అర్బన్ నవంబర్ 18 (విజయక్రాంతి): గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్‘ కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ 2025 చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకట్ గోపాల్ తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇట్టి ప్రతిజ్ఞ కార్యక్రమం నందు మాదక ద్రవ్యాల కొనుగోలు అక్రమ రవాణా చేసే వ్యక్తుల సమాచారాన్ని సంబంధిత అధికారులకు తెలియజేయాలని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్.జూనియర్ అసిస్టెంట్లు.వార్డు అధికారులు ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్.ఆర్ పి లు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.