19 May, 2026 | 10:04 PM

Breaking News

ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారిపై రాస్తారోక చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్   •   డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ డిసిసిబి చైర్మన్   •   రూ.21.49 లక్షల విలువైన నకిలీ వరి విత్తనాల పట్టివేత   •   హిజ్రాల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీస్ శాఖ చర్యలు   •   పీహెచ్సీలో అందిస్తున్న వైద్య సేవల పరిశీలన   •   ధాన్యం అన్‌లోడింగ్‌లో జాప్యం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలి   •   ఆందోళన వద్దు.. బంద్ రోజున మందులు అందుబాటులోనే   •   మంగళవారం సంతలో పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం   •   మొక్కజొన్న స్టాక్ పాయింట్లను తనిఖీ చేసిన డీఎం   •   ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •  

నాగిరెడ్డిపేట ఎంపీడీవో, ఎంపిఓలపై సస్పెన్షన్ వేటు

04-12-2025 04:37 PM

నామినేషన్ల వివరాలు అందజేయడంలో నిర్లక్ష్యం

ఆగ్రహం వ్యక్తం చేస్తూ సస్పెండ్ చేసిన కలెక్టర్

నాగిరెడ్డిపేట్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం ఎంపీడీవో, ఎంపీఓలు సస్పెన్షన్కు గురయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల వివరాలను అందించడంలో నాగిరెడ్డిపేట్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి లలిత కుమారి, మండల పంచాయతీ అధికారి ప్రభాకర్ చారిలు నిర్లక్ష్యం వహించినందున జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆశిష్ సంగ్వన్ గురువారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

వివరాలోకి వెళితే నాగిరెడ్డిపేట మండలంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 30వ తేదీ డిసెంబర్ ఒకటి రెండవ తేదీలలో మూడు రోజులపాటు సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు దాఖలు అయ్యాయి.అయితే ఆఇద్దరు అధికారులు జిల్లా అధికారులకు సకాలంలో నామినేషన్ల వివరాలు అందించడంలో నిర్లక్ష్యంతో పాటు అందుబాటులో ఉండకపోవడం ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఎల్లారెడ్డి డిఎల్పిఓ సురేందర్ ఫిర్యాదు మేరకు ఆర్డిఓ పార్థసారధి రెడ్డి విచారణ జరిపి ఉన్నత అధికారులకు నివేదిక అందజేశారు.దానితో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆశిష్ సంగ్వన్ నాగిరెడ్డిపేట్ మండల ఎంపీడీవో లలిత కుమారి,ఎంపీవో శ్రీనివాసులను సస్పెండ్ చేశారు.