14 August, 2026 | 10:03 PM

Breaking News

విద్యుత్ ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు ఘన నివాళి   •   విద్యార్థులు కళావేదికను సద్వినియోగం చేసుకొని ఉన్నతులుగా ఎదగాలి   •   విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి   •   బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ భాస్కర్   •   ఖబర్దార్ కౌశిక్ రెడ్డి.. పొంగులేటి సైన్యం ఊరుకోదు   •   పశువుల దొంగలు అరెస్టు   •   శ్రీ మహంకాళి సమేత బ్రహ్మసూత్ర నీలకంఠ స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం   •   మోస్రా వెళ్లే ప్రయాణికులకు తప్పని తిప్పలు   •   సీఎస్ సంజయ్ జాజు పలు అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్   •   వైన్ షాపులో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్   •  

పారుపల్లిలో బోడ సమ్మయ్య కుటుంబాన్ని పరామర్శించిన నాగినేని జగన్మోహన్ రావు

14-08-2026 08:50 PM

ముత్తారం,(విజయక్రాంతి): మండలంలోని పారుపల్లి గ్రామ ఉపసర్పంచ్ బోడ శ్యామల బాపు గౌడ్ తండ్రి బోడ సమ్మయ్య మృతి చెందగా, శుక్రవారం నిర్వహించిన మూడో రోజు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎక్స్‌ జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్ రావు పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా బోడ సమ్మయ్య చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

బోడ సమ్మయ్య మృతి కుటుంబానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని జగన్మోహన్ రావు ఆకాంక్షించారు. ఈ  కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చొప్పరి సంపత్, జిల్లా సెక్రటరీ అంబటి చంద్రమోగిలి, సీనియర్ నాయకులు పెద్దుల బొండాలు, పీక శంకర్, బోడ శ్రీను, ఇనుముల ప్రదీప్, సోతుకు రాజేందర్, యూత్ అధ్యక్షుడు శ్రీకాంత్, వార్డు సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.