27 June, 2026 | 7:44 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

మంత్రాల నెపంతో హత్య

03-11-2025 02:08 AM

ఆసిఫాబాద్ జిల్లాలో ఘటన

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): మంత్రాలు చేస్తున్నాడనే అనుమానంతో వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం పిట్టగూడాలో చోటుచేసుకుంది. పిట్టగూడాకు చెందిన ఉర్వేత హనుమంతరావు(52) మంత్రాలు చేస్తున్నాడని అదే గ్రామానికి చెందిన రాయిసిడం వినోద్ హత్య చేశాడు.

హనుమంతరావు మెడపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే కుప్పకూలి మరణించగా, కుటుంబ సభ్యులు గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూఢనమ్మకాలను విశ్వసించవద్దని, ఇలాంటి ఘటనలు గమనించినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని రెబ్బెన సీఐ సంజయ్ కుమార్ తెలిపారు.