విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించవద్దు ఎంపీడీవో
30-05-2026 06:55 PM
బోథ్,(విజయక్రాంతి): విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ప్రజల కోసం అవసరమైన పనులను సకాలంలో చేయాలని ఎంపీడీవో రమేష్ కోరారు. శనివారం మండలంలోని వివిధ గ్రామాల కార్యదర్శి విధులు నిర్వహించిన వారు బదిలీ కావడంతో మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి వారు చేసిన కృషిని అభినందించారు.
ఉద్యోగిని బదిలీ తప్పదని చేసిన సేవలు ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. ప్రభుత్వపరంగా మంజూరి అయ్యే వివిధ పథకాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు చేరవేసే విధంగా పాటుపడాలన్నారు. మనం చేసిన పనులే కలకాలం ప్రజలు గుర్తించుకుంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఉన్నారు.






