15 June, 2026 | 2:19 PM

Breaking News

పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •   యోగ దినచర్యలో భాగం కావాలి: జిల్లా ప్రోగ్రాం అధికారి   •   మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ఫిషరీస్ భూమి సర్వే పూర్తి   •  

ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేసిన ఎంపీడీవో

07-02-2026 12:00 AM

నాగిరెడ్డిపేట్, ఫిబ్రవరి 6 (విజయ క్రాంతి): మండలంలోని అచ్చయపల్లి,బొల్లారం, గ్రామాలలో ప్రాథమిక పాఠశాల అంగన్వాడి కేంద్రాల ను ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ అకస్మాతిగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ ప్రవీ ణ్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని,పాఠశాల ఆవరణలో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని,త్రాగునీరు సరఫరా స్వచ్ఛమైన నీరును విద్యార్థులకు అందించాలన్నారు.అచ్చయ పల్లి గ్రామ ట్యాంకు లీకేజీలను పరిశీలించి లీకేజీలు లేకుండా ఎప్పటికప్పుడు తగు చర్యలు చేపట్టాలన్నారు.

బొల్లారం పాఠశాల ఉపాధ్యాయుల బృందం ఎంపీడీవోలు శాలువతో ఘనంగా సన్మానించారు. అలాగే గ్రామాలలో కూడా నీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు ఇప్పటినుండే ఏర్పాటు చేసుకోవాలన్నారు.గ్రామాలలో మురికి కాలువలు,పరిసరాలు పరిశుభ్రత,చెత్త సేకరణ వివిధ పనులన్నీ పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. అనంతరం రాఘవపల్లి గ్రామంలో నర్సరీని పరిశీలించి నర్సరీలో ఉన్న మొక్కలకు ఉదయం సాయంత్రం వేళలో సరిపడా నీటిని అందించాలని నర్సరీలో ఉన్న ప్రతి మొక్కను చనిపోకుండా బతికించాలన్నారు. గామ సర్పంచులు బెస్త సాయిలు, ప్రభు గౌడ్, కార్యదర్శులు వెంకట్ రాములు, సంతోష్ కుమార్, ఫీల్ అసిస్టెంట్లు ఫర్వినా బేగం,బెస్త మల్లయ్య  పాల్గొన్నారు.