10 April, 2026 | 5:30 AM

వీధి శునకాలను తరలించండి

08-11-2025 12:32 AM
  1. హైవేలు, ఎక్స్‌స్ప్రెస్‌వేలపై పశువులను తిరగనివ్వొద్దు
  2. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశం
  3. ప్రజలకు ప్రత్యేక హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేయాలని సూచన

న్యూఢిల్లీ, నవంబర్ 7: పాఠశాలలు, ఆస్పత్రులు, బస్‌స్టేషన్లతో సహా అన్ని ప్రజా ప్రాం తాల నుంచి వీధి శునకాలను తొలగించాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.  వాటిని వాటి అసలు స్థానాలకు తిరిగి ఇవ్వడానికి బదులుగా నియమించబడిన ఆశ్ర యాలకు తరలించాలని ఆదేశించింది.

అమికస్ క్యూరీ నివేదికను అధికారిక ఉత్తర్వులో భాగంగా చేర్చాలని కోర్టు ఆదేశించింది. హైవేలు, ఎక్స్‌స్ప్రెస్‌వేలపై పశువులను తిరగనివ్వొద్దని, వాటిని ఆశ్రయాలకు తరలించాల ని ఇటీవల రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థిస్తూ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఆదేశాల అమలుపై సమ్మతి అఫిడవిట్లు సమర్పించాలని కోరింది.

రహదారి భద్రతను నిర్ధారించడానికి, ప్రజా పరిశుభ్రతను కాపాడటానికి వీధి జంతువులను నిరోధించడానికి ప్రత్యేక గస్తీ బృందాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రజలకు ప్రత్యేక హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచిస్తూ ఆదేశాలు జారీ చేసింది.