16 April, 2026 | 5:11 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

లోకమంతటికి ఆరోగ్య ప్రదాత హనుమంతుడే

16-04-2026 01:56 PM

వేద పండితులు నిమ్మగడ్డ సందీప్ శర్మ

ఖానాపూర్ (విజయక్రాంతి): అతిభలవంతుడు, లోకమంతటికి ఆరోగ్యప్రదాత హనుమంతుడే అని వేద పండితులు నిమ్మగడ్డ సందీప్ శర్మ అన్నారు. ఖానాపూర్ మున్సిపాలిటీ కొమురం భీం చౌరస్తాలో గల పంచముఖ హనుమాన్ దేవాలయంలో ప్రతినెల నిర్వహిస్తున్న మాసోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు ఆలయంలో పూర్వభద్ర నక్షత్రం మహోత్సవ కార్యక్రమంలో గణపతి పూజా పంచామృత అభిషేకం అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం అనంతరం హారతి కార్యక్రమాలను ఆలయ అర్చకులు తిరునగరి నందకిషోర్ నిర్వహించారు.

వేద పండితులు నిమ్మగడ్డ సందీప్ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి .ఈ కార్యక్రమాలు చేయడం వల్ల భక్త జనాల్లో దారిద్రత తొలిగిపోయి సకల కోరికలు నెరవేరుతాయని పండితులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అల్లాడి వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు తోట హనుమం తు, కార్యదర్శి తుమ్మలపల్లి లక్ష్మణ్,, కోశాధికారి ఎడ్ల రాజేశ్వర్, సభ్యులు ప్రవీణ్ ,రాజేశ్వర్, లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు బండి పల్లి సింధుజ, బొప్పాలపు సత్యవతి, తదితరులు పాల్గొన్నారు.