సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
16-04-2026 02:00 PM
నాగిరెడ్డిపేట, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): మండలంలోని పోచారం గ్రామంలో 20 లక్షల,,రూపాయల నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ సంజీవరావు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు సహకారంతో 20 లక్షల రూపాయల నిధులతో గ్రామంలో నూతన సిసి రోడ్ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం 20 లక్షల రూపాయల నిధులు స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్రావు మంజూరు చేసినందుకు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస రెడ్డి,గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరస గౌడ్,ఉప సర్పంచ్ మేకల రమేష్,పాలకవర్గ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






