29 April, 2026 | 10:16 PM

Breaking News

నీరు, పారిశుధ్యంపై అవగాహన సదస్సు   •   సనత్‌నగర్‌లో ఘనంగా సమ్మర్ క్రికెట్ క్యాంప్ ప్రారంభం   •   కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ   •   పది ఫలితాలలో సత్తా చాటిన మండల విద్యార్థులు   •   సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థుల ప్రతిభ..   •   పని ప్రదేశాల్లో మహిళలను వేధిస్తే సహించం   •   భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న వీరబ్రహ్మేంద్రస్వామి వార్షికోత్సవ వేడుకలు.   •   పెట్రోల్ కృత్రిమ కొరత సృష్టిస్తే... క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం   •   టెన్త్ ఫలితాల్లో ఎంజెపీటీసీడబ్ల్యూఆర్ విద్యార్థినుల ప్రతిభ   •   పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినట్లు కాదు   •  

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

29-04-2026 08:24 PM

అశ్వాపురం,(విజయక్రాంతి): అశ్వాపురం మండలంలోని మల్లెలమడుగు గ్రామపంచాయతీ పరిధిలో మేకల శ్యామల -యాకూబ్ కుటుంబం ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని గృహప్రవేశాన్ని ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల ద్వారా అర్హులైన కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసం కల్పిస్తున్నామని అన్నారు. గృహ యజమాని శ్యామల కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.