మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శ
మృతుని కుటుంబానికి రూ. 10,000 ఆర్ధిక సాయం
ధర్మపురి,(విజయక్రాంతి): వెల్గటూర్ మండలం రాజక్కపల్లి గ్రామంలో ఇటీవల విద్యుత్ ఘాతంతో దుర్మరణం చెందిన కుశనపెల్లి శ్రీనివాస్ కుటుంబాన్ని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుని కుటుంబానికి రూ. 10,000 అందించి ఆర్థికభరోసా కల్పించారు. మృతుని కుటుంబానికి అన్నీ విధాలుగా ఆదుకుంటూ అందుబాటులో ఉంటామనీ హామీ ఇచ్చారు. అధైర్య పడకుండా శ్రీనివాస్ జ్ఞాపకాలతో ముందుకు సాగాలనీ కుటుంబానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మనోధైర్యం కల్పించారు. ఆయన వెంట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్,బీఆరెఎస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శిలు చల్లూరి రాంచందర్ గౌడ్,జూపాక కుమార్, సీనియర్ నాయకులు మూగల సత్యం, పెద్దూరి భరత్ కుమార్,గాజుల సుమన్,దోరిశెట్టి మల్లేశం తదితరులు ఉన్నారు.






