15-02-2026 12:00:00 AM
మేడ్చల్, ఫిబ్రవరి 14 (విజయ క్రాంతి): మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఎల్లంపేట మున్సిపాలిటీలో ఎక్స్ అఫీషియో ఓటు హక్కు వినియోగించుకోవ డానికి దరఖాస్తు చేశారు. వ్యక్తిగత సహాయకుడు ఎమ్మెల్యే తరఫున దరఖాస్తు పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఎల్లంపేట మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా, బీఆర్ఎస్ 12 వార్డులలో గెలుపొందింది. కాంగ్రెస్ 8, బిజెపి నాలుగు వార్డులలో విజయం సాధించాయి. ఎక్స్ అఫీషియో ఓటు కీలకమైంది.