3 July, 2026 | 9:37 PM

Breaking News

ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •   హెచ్‌పి గ్యాస్ ఏజెన్సీని ఆకస్మిక తనిఖీ చేసిన హెచ్‌పిసిఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కోమర శ్రీనివాసు   •   బదిలీపై వెళ్లిన ఇంచార్జ్ ఎంపీడీవోకు ఘన సన్మానం   •   ఆయిల్ పామ్ సాగుతో అద్భుత ఫలితాలు సాధిస్తున్న ప్రభాకర్ రెడ్డికి సన్మానం   •   వర్షపు ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి టార్పాలిన్ అందించిన సర్పంచ్   •   స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •  

మంథని ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

13-02-2026 04:14 PM

కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించిన ప్రజలకు పేరుపేరునా కృతజ్ఞతలు .

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.

మంథని,(విజయక్రాంతి): ఈ మున్సిపల్ ఎన్నికల్లో(Manthani Municipality) కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని అందించి, నాపై నమ్మకం ఉంచిన మంథని మున్సిపల్ ప్రజలకు పేరుపేరున రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.  నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఇక అభివృద్ధి అంటే కేవలం మాటల్లో కాకుండా, మీ కళ్ల ముందు కనిపించే మార్పులో చూపిస్తానని మంత్రి తెలిపారు. 

మీ అందరి సహకారంతో మంథని మున్సిపాలిటీని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని, ఈ గెలుపునకు అహర్నిశలు కృషి చేసిన నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు  నాయకులకు పేరుపేరునా మంత్రి ధన్యవాదాలు తెలిపారు. విజయగర్వంతో కాకుండా, ఇక బాధ్యతతో మీ సేవలో నిరంతరం ఉంటామని శ్రీధర్  బాబు మంథని పట్టణ ప్రజలకు హామీ ఇచ్చారు.