తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి
హైదరాబాద్: తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) హైదరాబాద్లోని చారిత్రక కట్టడాలను సందర్శించారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తామని, ఆర్కియాలజీ విభాగం(Department of Archaeology) సమన్వయంతో ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. పర్యాటక ప్రాంతాలకు సందర్శకులు వచ్చేలా సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. సౌకర్యాల కల్పనకు ప్రత్యేక బడ్జెట్ ను కేటాయిస్తామన్నారు. పర్యాటక ప్రాంతాల వద్ద మెరుగైన మౌలిక వసతులను కలిపిస్తామని తెలిపారు. నగరంలోని కుతుబ్షాహీ టూంబ్స్, కటోరా హౌస్, చార్మినార్ ప్రాంతాలను పరిశీలించి, వారసత్వ సంపద పరిరక్షణ, పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. చారిత్రక కట్టడాలకు పూర్వవైభవం తీసుకువస్తామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.






