11-02-2026 04:30:58 PM
హైదరాబాద్: కొల్లాపూర్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలందరూ వారి అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని మంత్రి కోరారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ... రాష్ట్రంలో 75 శాతం మున్సిపాలిటీలను ప్రజా ప్రభుత్వం కైవసం చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. గత పాలకుల అవినీతికి కొల్లాపూర్ మున్సిపాలిటీలోని ప్రజలు తమ ఓటింగ్ తో బుద్ధి చెప్పబోతున్నారని మంత్రి తెలిపారు. 19వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని మంత్రి జూపల్లి ధీమా వ్యక్తంచేశారు.