17 March, 2026 | 1:24 PM

Breaking News

కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్.. ఢిల్లీకి ఎన్నిసార్లయినా వెళ్తాం   •   బడ్జెట్ అంచనాలు బోల్తా కొట్టాయి.. రివైజ్డ్ అంచనాలు రీచ్ కావట్లేదు   •   ఈ నెల 22 నుంచి రైతు భరోసా పంపిణీ.. అసెంబ్లీ సాక్షిగా ఆది శ్రీనివాస్ ప్రకటన   •   మియాపూర్‌లో రోడ్డుకు అడ్డంగా పడిన బస్సు.. 10 మందికి గాయాలు   •   8 నెలల క్రితం లవ్ మ్యారేజ్.. 4 నెలల గర్భిణి భార్యను చంపిన భర్త   •   కేసీఆర్ సంచలన నిర్ణయం.. పైలెట్ రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీసు!   •   కూకట్‌పల్లిలో భారీ దారి దోపిడీ.. కళ్లలో కారం కొట్టి..   •   పెద్దపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి   •   గవర్నర్ ప్రసంగం డొల్ల   •   ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి   •  

సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలి

17-03-2026 12:27 AM

మెదక్, మార్చి 16(విజయ క్రాంతి) :సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతనాలు నిర్ణయించి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని TSUTF జిల్లా అధ్యక్షులు పద్మారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. TSUTF తెలంగాణ రాష్ట్ర  కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ ప్రతిమాసింగ్ కు వినతి పత్రం అందజేశారు.

సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులు తక్కువ వేతనాలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 202425 సంవత్సరంలో నిర్వహించిన సమ్మె కాలానికి 29 రోజులకు సంబంధించిన జీతాలను కూడా ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో TSUTF జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు  కే పద్మారావు, శ్రీనివాసరావు, కోశాధికారి అజయ్ కుమార్, కార్యదర్శులు నాగుల్ మీరా, శేఖర్, భీమ్లా నాయక్, నర్సింలు, తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రాజు, సిఆర్పిల జిల్లా అధ్యక్షులు గట్టయ్య, KGBV రాష్ట్ర నాయకులు సుహాసిని, పూర్ణేశ్వర్  ఉమా, పద్మ, సమగ్ర శిక్ష ఉద్యోగులు  పాల్గొన్నారు.