మిల్లర్లు వరి ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి,(విజయక్రాంతి): రైస్ మిల్లర్లు వరి ధాన్యాన్ని వేగంగా దిగుమతి చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆది శ్రీనివాస్ చందుర్తి మండల కేంద్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో కాసేపు ముచ్చటించి కొనుగోలు ప్రక్రియకు సంబంధించిన వివరాలు, అలాగే ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు.
వరి ధాన్యం రైస్ మిల్లులకు ట్రాక్టర్ల ద్వారా తరలించడం వల్ల రవాణా వేగవంతం అవుతుందని రైతులు తెలిపారు... రైస్ మిల్లర్లో ధాన్యం దిగుబడి చేసే క్రమంలో ఆలస్యం చేయకుండా వెనువెంటనే దిగుమతి చేసుకోవాలని ఆ ప్రక్రియ సజావుగా సాగేలా అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని విప్ ఆది శ్రీనివాస్ సూచించారు.






