గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం
13-05-2026 09:13 PM
రాష్ట్ర ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే విజయ రమణారావు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): గ్రామాలలో మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. బుధవారం రాత్రి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని బొంతకుంటపల్లి, నరసయ్య పల్లి గ్రామాలలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు చేశారు. బొంతకుంటపల్లిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ ఎనిమిది లక్షల రూపాయలతో నూతనంగా నిర్మాణం చేసిన కమ్యూనిటీ హాల్ను ప్రారంభించారు. అంతేకాకుండా సిసి రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణారావును లింగంపల్లి కొమురయ్య , కొండ్ర స్వరూప ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.






