సెప్టెంబర్ 2వ ,3వ తేదీలలో మండల స్థాయి క్రీడా పోటీలు
నేరేడుచర్ల, ఆగస్టు 27(విజయ క్రాంతి): సెప్టెంబర్ నెల 2 వ, 3వ తేదీలలో మండల పాఠశాల స్థాయిలో క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని నేరేడుచర్ల ఎంఈఓ బాలునాయక్ పత్రిక ప్రకటన లో తెలిపారు. మండల స్థాయి స్కూల్ గేమ్స్ ను తేదీ 2 న బాలికలకు మరియు 3 వ తేదీన బాలురకు ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాల విద్యార్థిని విద్యార్థులుకు
పీఎం శ్రీ జి.ప.ఉ.పా నేరేడుచర్ల నందు నిర్వహించబడునని తెలిపారు. అండర్ 14 విభాగంలో పాల్గొనదలచిన వారు 1/1/2013 తర్వాత, అండర్ 17 విభాగంలో పాల్గొనదలచినవారు 1/1/2010 తర్వాత జన్మించివుండాలన్నారు.ఈ క్రీడలు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇన్చార్జి D..ఏసుపాదం (పి.డి)
M. యాదగిరి (పి.డి)
B..శ్రీనివాస్ (పి.డి)
V. అశోక్ (పి.డి) మరియు ఇతర పి.ఈ.టీ ,పీ,డీలు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.






