ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండ కట్టాలి
బోత్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో సిపిఐ ఆధ్వర్యంలో అంతర్జాతీయ కార్మిక దినోత్సవ మే డే ఒక వంద 41వ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ కార్యాలయంలో జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా నాయకులు బి గోవర్ధన్ మాట్లాడుతూ ఎర్రజెండా నీడన ఎంతోమంది కార్మికులు ఉద్యమాలు చేసి ప్రాణాలు అర్పించారని వారి నెత్తురుతో తడిసిన ఎర్రజెండ నే కార్మికులకు అండగా నిలిచిందన్నారు. ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని వాటిని ప్రభుత్వాలు విరమించుకోవాలన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు మున్సిఫ్ అజయ్ హమాలి యూనియన్ నాయకులు ఆశన్న ప్రసాద్ బాబు పాల్గొన్నారు. సోనాల మండల కేంద్రంలో జరిగిన భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు కొండమడుగు శంకర్ పాల్గొని ప్రసంగించారు కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ఆశన్న చిన్నయ్య లక్ష్మణ్ సాయి అశోక్ భీమ్రావు పాటిల్ బోరే రవీందర్ లతోపాటు హమాలీ యూనియన్ ఆటో యూనియన్ కార్మికులు పాల్గొన్నారు






