గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం
07-07-2026 02:33 PM
నాగిరెడ్డిపేట్,జులై 7 (విజయ క్రాంతి): మండలంలోని గోపాల్పేట గ్రామంలో పది లక్షల నిధులతో నూతన సిసి రోడ్డు నిర్మాణం పనులు చేపట్టినట్లు గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్ తెలిపారు.గోపాల్పేట్ గ్రామ అభివృద్ధి కొరకు స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు 10 లక్షల నిధులు మంజూరు చేసినందుకు గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.సీసీ రోడ్డు పనులు నాణ్యతతో చేపట్టాలని సంబంధించిన కాంట్రాక్టర్కు సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, ఉప సర్పంచ్ గులాబ్ హుస్సేన్,నాయకులు విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.






