15 May, 2026 | 1:46 AM

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

15-05-2026 12:39 AM

ధర్మపురి,మే14(విజయక్రాంతి):ఎండపల్లి మండలం చర్లపల్లి గ్రామశివారులో బుధవారం అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని వాహనం డీకొట్టి వ్యక్తి మృతి చెందాడు.మృతుడు సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన పరశురామ్ మృతుడు ఎరవెల్లి పరశురాం(43) గా పోలీసులు గుర్తించారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ వెంకట్ రెడ్డి, ధర్మపురి సీఐ రాం నర్సింహా రెడ్డి పరిశీలించారు. మొదట హత్యగా భావించిన పోలీసులు క్లూస్ టీమ్ ఆధారంగా ప్రమాదం జరిగే మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు.

ఎస్త్స్ర పి ఉదయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు పరశురామ్ తన యొక్క కారును రోడ్డు పక్కన పార్క్ చేసి రోడ్డు దాటే క్రమంలో ఎదో గుర్తు తెలియని వాహనం టక్కరి ఇచ్చిందనీ,మృతునికి బలమైన రక్త గాయాలు అయ్యాయని తెలిపారు.

ఇట్టి ప్రమాదంలో మృతుడు సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి ఒక కొడుకు,ఇద్దరు కూతుల్లు సంతానం కాగా, మృతుని భార్య గత నాలుగు సంవత్సరాల క్రితం చనిపోయినట్లు వెల్లడించారు. మృతుని తల్లి ఎరవెల్లి లింగవ్వ ఇచ్చిన దరఖాస్తు పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన్నట్లు ఎస్త్స్ర పి. ఉదయ్ కుమార్ తెలిపారు.