calender_icon.png 19 February, 2026 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి మల్లికార్జున స్వామి జాతర

19-02-2026 02:11:57 AM

మునిపల్లి, ఫిబ్రవరి 18: మండల పరిధిలోని కంకోల్ - మొగ్దుంపల్లి గ్రామాల సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయ జాతరోత్సవాలు ఈ నెల 19వ తేదీ నుంచి 22 వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ వేడుకలకు హాజరు కావాలని ఎమ్మెల్సీ అంజిరెడ్డికి, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డిలకు ఆహ్వాన పత్రికను బుధవారం బీజేపీ మండల కమిటీ అందించింది. అలాగే స్వామివారి ఆలయ ప్రతిష్టాపన వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వా మివారి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.  ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నాగిశెట్టి, జిల్లా నాయకుడు రామ్ రఘు, గ్రామ పెద్దలు చంద్రశేఖర్ పటేల్, రాచన్న తదితరులు పాల్గొన్నారు.