‘సర్’ను పరిశీలించిన మహేష్ గౌడ్
ఘట్ కేసర్, జూలై 27 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ ప రిధిలోని ఘనపురం, లింగాపురం గ్రామాల లో జరుగుతున్న సర్ పక్రియను మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహే ష్ గౌడ్, ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ అ ధ్యక్షులు సామల అమరేందర్ పరిశీలించి సర్ పై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడు తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఎల్ఏలు, బిఎల్ఓ లతో సమన్వయయం చేసుకుని ప్రజలకు సర్ ప్రక్రియ పై అవగాహన క ల్పించాలని, అర్హులైన ప్రతి ఓటరు తన ఓటు హక్కును కాపాడుకునేందుకు సర్ ప్రక్రియ లో తమ ఓటరు వివరాలను తప్పనిసరిగా నమోదు చేసేలా చూడాలన్నారు.
ఈకార్యక్రమంలో మాజీ సర్పంచులు ననావత్ రూప్ సింగ్ నాయక్, మమత గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాయరు విశ్వనాధం, మాజీ ఉప సర్పంచ్ లు వేముల సత్తయ్య గౌడ్, వేముల పరమేష్ గౌడ్, నాయకులు వేముల రాజు గౌడ్, మాజీ గుర్జకుంట నర్సింహా, మెట్టు రమేష్, వేముల శంకర్ గౌడ్, ననావత్ సురేష్ నాయక్, బర్ల అనిత, పైళ్ల లతరెడ్డి, పైళ్ల జంగారెడ్డి, పూస రమేష్ బిఎల్ఓలు, తదితరులు పాల్గొన్నారు.






