25 July, 2026 | 10:13 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

ఆరుతడి పంటల సాగుతో నష్టాలను తగ్గించుకోవాలి

25-07-2026 09:10 PM

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన సదస్సు

గోవర్ధనగిరి సర్పంచ్ ముంత జ్యోతి బిచ్చన్న యాదవ్

వీపనగండ్ల: ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగును తగ్గించి ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలని వనపర్తి జిల్లా గోవర్ధనగిరి మండల గ్రామ సర్పంచ్ ముంత జ్యోతి బిచ్చన్న యాదవ్ సూచించారు. మండలంలోని గోవర్ధనగిరి గ్రామంలో శనివారం ఎల్‌నినో ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ ముంత జ్యోతి బిచ్చన్న యాదవ్, వ్యవసాయ విస్తరణ అధికారి (ఏఈఓ) నరేష్ మాట్లాడుతూ... వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా నీటి వినియోగం అధికంగా ఉండే వరి సాగును తగ్గించి, కంది, మినుములు, పెసర, సజ్జలు, కొర్రలు, జొన్నలు, రాగులు, పామాయిల్ వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. నీటి వసతి సమృద్ధిగా ఉన్న రైతులు మాత్రమే వరి సాగు చేపట్టాలని తెలిపారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ఆరుతడి పంటలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలు అందిస్తోందని చెప్పారు. అలాగే చిరుధాన్యాలు, తృణధాన్యాలను ప్రత్యామ్నాయ పంటలుగా సాగు చేయడం ద్వారా వర్షాభావ పరిస్థితుల్లో నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని వివరించారు.