ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం
* మంత్రి ఉత్తమ్ సహకారంతోనే సాధ్యం
* ముత్తినేని వీరయ్య
గరిడేపల్లి,(విజయక్రాంతి): మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారధ్యంలో సార్ ప్రక్రియ సమర్ధవంతంగా నిర్వహించినట్లు వికలాంగుల రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. గరిడేపల్లి మండల కేంద్రంలో శనివారం మండల పార్టీ అధ్యక్షులు త్రిపుర అంజన్ రెడ్డి తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. హుజూర్నగర్ నియోజకవర్గ కోఆర్డినేటర్ వీఆర్వో కిషోర్ నాతో సహా బాధ్యతలు చేపట్టామన్నారు. మంత్రిగా మరోపక్క మండలాలలో నిత్యం జూమ్ మీటింగులు ద్వారా ఎప్పటికప్పుడు పార్టీ శ్రేణుల దిశా నిర్దేశించడం వలన దేశంలో ఎక్కడా లేనంతగా ఇంత పెద్ద సంఖ్యలో సర్ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరిగిందని అందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి కారణమన్నారు.
మొత్తం 311 బూతులకు గాను 137 బూతులలో వందకు వంద శాతం పూర్తిగా చేసినట్లు తెలిపారు. మిగిలిన 174 బూతులలో ఒకటి రెండు మాత్రమే మిగిలిపోయాయని నియోజకవర్గ మొత్తంలో 1.96 మాత్రమే పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. వీటిని కూడా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి సంక్షేమ పాలనకు నిదర్శనం అన్నారు. అందరూ మండల పార్టీ అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు మాజీ జెడ్పిటిసిలు ఎంపీపీలు ప్రజాప్రతినిధులు సమన్వయం చేసుకుంటూ అందరి సహకారంతో నియోజకవర్గ వ్యాప్తంగా సమిష్టి కృషితో పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నాగేశ్వరరావు ఎంపిటిసి బాల్ దూరి సందీప్ ఎడవెల్లి ఉపేందర్ రెడ్డి, కొలిపాక లింగయ్య, బండారు అంజయ్య, సైదులు పలువురు పాల్గొన్నారు






