13 April, 2026 | 1:33 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

దుర్గామాత మండపం వద్ద స్వయంభుగా వెలసిన గణనాథుడు

02-10-2025 12:09 AM

మొక్కలు నాటేందుకు తవ్విన గుంతలో బయటపడ్డ విగ్రహం

ఆదిలాబాద్, అక్టోబర్ ౧ (విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో శరన్నవరాత్రి ఉత్సవా ల సందర్భంగా అద్భుత ఘటన చోటుచేసుకుంది. న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో దుర్గా మాత మండపం వద్ద స్వయంభూగా వియకుని విగ్రహం వెలిసింది. బుధవారం దుర్గా దేవి మండపం వద్ద ఆదిలాబాద్ మున్సిపల్ కమిషన్ రాజుతో పాటు కాలనీవాసులు మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వుతుండగా ఒక్కసారిగా వినాయకుని విగ్రహం బయటపడింది. దీంతో కమిషనర్‌తో పాటు కాలనీవాసులు ఆశ్చర్యానికి గురై ఆ వినాయకుని విగ్రహాన్నీ అక్కడే ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు చేశారు. దుర్గమ్మ మండపం వద్ద వినాయకుడి విగ్రహం బైట పడటం అంత దైవ సంకల్పమని కాలనీవాసులు పేర్కొన్నారు.