11 March, 2026 | 12:01 PM

పశువులకు తప్పనిసరిగా టీకా వేయించాలి

11-03-2026 01:25 AM

దండేపల్లి (లక్షెట్టిపేట), మార్చి 10: జిల్లాలోని పాడి రైతులు తమ పశువులకు తప్ప నిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం దండేపల్లి మండలం రాజంపేటలో జిల్లా పశుసంవర్ధక, పశు వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా గాలికుంటు వ్యాధి నివారణ కార్యక్రమానికి జిల్లా పశువైద్య శాఖ అధికారి యాకుబ్ రెడ్డి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్ లతో కలిసి హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. పాడి రైతులు తమ పశువులకు ఏమైనా సమస్యలున్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించా లని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య శాఖ అధికారులు, రైతులుపాల్గొన్నారు.