9 May, 2026 | 10:40 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

అందెశ్రీ సంతాప సభను ఘనంగా నిర్వహిద్దాం

18-11-2025 12:20 AM

దళితులు, కవులు, కళాకారులు, ప్రజాసంఘాలందరూ ఒకే వేదికపైకి రావాలి

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ 

హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ర్ట గీత రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ సంతాప సభను తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా నిర్వహించా లని ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మంత్రి నివాసంలో కవులు, కళాకారులు, దళిత సంఘాలు, ప్రజా సంస్థలు, ఉద్యోగ సంఘాలతో కలిసి ఆయన సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మా ట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ నిర్ణయం నుంచి కళాకారులకు అధిక గౌరవం దక్కేలా తీసుకున్న చర్యల వరకు సీఎం రేవంత్ రెడ్డి దళి త-బహుజన వర్గాల పక్షాన నిలిచిన నాయకుడని మంత్రి గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా, దళిత ఐక్యత సందేశంగా అందెశ్రీ సంతాప సభను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. అందెశ్రీ అంత్యక్రియల్లో సీఎం స్వయంగా పాల్గొనడం.. కళా కారుల పట్ల ప్రభుత్వం చూపుతున్న గౌరవానికి ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి పేర్కొ న్నారు.

అందెశ్రీ రచనలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకాలని అన్నారు. సంతాప సభను సాంస్కృతిక-సామాజిక ఘట్టంగా, ప్రజలు, కవులు, కళాకారులు, విద్యార్థులు, సంఘాలు అందరూ పాల్గొనే వేదికగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రొ. కాశీం, ప్రొ. విద్యాసాగర్, టీఎంఆర్‌పీఎస్ నేతలు మేడి పాపయ్య, ఇటుక రాజు, రమేష్, సతీష్ మాదిగ, జెన్కో మేడి రమేష్, సంగీతం రాజలింగం, అరెపల్లి రాజేందర్, మోహన్, చింతా బాబు, మంచాల యాదగిరి, గంట సుదర్శన్, అందె రుక్కమ్మ, ముం జగాల విజయ్ కుమార్, మల్లెపోగు శ్రీనివాస్, జీడి నరసింహ పాల్గొన్నారు.