2 May, 2026 | 6:54 PM

Breaking News

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •   వైభవంగా స్వామివారి నిత్య కళ్యాణం   •   మెరుగైన సేవల కోసం 108 సిబ్బందికి శిక్షణ   •   వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం   •  

ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన కుటుంబాలకు 50 లక్షల నష్టపరిహారం ప్రకటించాలి

07-10-2025 01:28 AM

-ప్రభుత్వానికి మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహ విజ్ఞప్తి 

ఖైరతాబాద్; అక్టోబర్ 6(విజయ క్రాంతి) : ఎస్సీ వర్గీకరణ కోసం అమరులైన నాలుగు మాదిగ కుటుంబాలకు 50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని మాజీ మంత్రి మో త్కుపల్లి నరసింహ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశా రు. ఈ మేరకు సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మాదిగ సంఘాల ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై వివి ధ సంఘాల ప్రతినిధులు ఇటుక రాజు, శ్రీనివాస్, బొంకూరి సురేందర్ తదితరులతో కలిసి మాట్లాడారు.

ఎస్సీ వర్గీకరణ చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపా రు. 1994 నుంచి ఎమ్మార్పీఎస్ ఉద్యమ కాలంలో పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నెక్లెస్ రోడ్‌లో ఎకరం భూమిని కేటాయించి 100 అడుగుల ఎత్తు లో అమరవీరుల స్తూపం నిర్మింపజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ సంఘా ల ప్రతినిధులు భీమాశంకర్, పొన్నాల యాదయ్య, జనార్ధన్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.