30 June, 2026 | 8:35 PM

Breaking News

వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •   రమాదేవి సేవలు చిరస్మరణీయం   •  

కేటీఆర్.. నీ నోరు ఫినాయిల్‌తో కడుక్కో

08-05-2026 12:00 AM

ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ 

హైదరాబాద్, మే 7 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తన నోరును ఫినాయిల్‌తో కడుక్కోవాలని ఫిషరీష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విమర్శించారు. బీఆర్‌ఎస్ నాయకులను పాత చెప్పుతో కొట్టినా పాపం పోదన్నారు. గురువారం మెట్టు గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ముఖ్యంగా కేటీఆర్ తన భాషను మార్చుకోవాలని.. లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

కేటీఆర్ ప్రభుత్వంపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. గత పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ నేత లు రైతులను తీవ్రంగా గోస పెట్టారని, తెలంగాణ లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. పంజాబ్‌కి వెళ్లి అక్కడి రైతులకు చెక్కులు పంపిణీ చేయడం తెలంగాణ రైతు లను అవమానించడమేనని విమర్శించారు.

రైతు ల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రైతు కమిషన్‌ను ఏర్పాటు చేసిందని, రైతులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. కేటీఆర్ తన చుట్టూ నలుగురు చిల్లరగాళ్లను, పదిమం ది భజన పరులను వేసుకొని తిరుగుతూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని, బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేటీఆర్ ఇలాంటి విమర్శలు చేస్తున్నారని, ప్రజలు గమనిస్తున్నారని మెట్టు సాయికుమార్ హెచ్చరించారు.