24-02-2026 12:08:07 AM
మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ
కోదాడ, ఫిబ్రవరి 23: కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ సహకారంతో కోదాడ పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. సోమవారం కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ సమక్షంలో మున్సిపల్ చైర్ పర్సన్ గా పదవి బాధ్యతలు స్వీకరించారు.
అంతకు ముందు శ్రీరంగాపురం అభయాంజనేయ స్వామి 23వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని పూజలు నిర్వహించారు. భాధ్యతల స్వీకరణ అనంతరం ఆమె మాట్లాడుతూ తనకు మునిసిపల్ చైర్ పర్సన్ గా బాధ్యతలు అప్పగించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కి ఋణపడి ఉంటానన్నారు. కాగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ కుసుమ వెంకట్ రత్నం బాబు, వైస్ చైర్మన్ దేవర పల్లి మల్లేశ్వరి లను ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ గజమాల తో అభినందించారు.
కాగా చైర్మన్, వైస్ చైర్మన్ లను మాజీ ఎమ్మెల్యే చందర్ రావు, , కౌన్సిలర్ లు నాయకులు అభిమానులు కార్య కర్తలు తదితరులు శుభా కాంక్షలు తెలిపారు. కోదాడ మున్సిపల్ వైస్ ఛైర్మన్ గా భాధ్యతలు స్వీకరించిన దేవర పల్లి మల్లేశ్వరి మాట్లాడుతూ తన ఎంపిక కు సహాకారం అందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల కు కృతజ్ఞతలు తెలిపారు. కోదాడ పట్టణ అభివృద్ధికి పాలక వర్గం తో కలిసి కృషి చేస్తానన్నారు.