7 July, 2026 | 8:00 PM

ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా కాసు గణేష్ ఏకగ్రీవ ఎన్నిక

07-07-2026 06:44 PM

చిట్యాల,(విజయక్రాంతి): ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన కాసు గణేష్ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా మంగళవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గుండ్రాంపల్లి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన ఎన్నిక గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు. సంఘం నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా కంకల బీరయ్య (ఎల్లంబావి), కార్యదర్శిగా కొండె వెంకటేష్ (ఏపూర్), కోశాధికారిగా దిందే ఆడవయ్య (కాట్రేవు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

డైరెక్టర్లుగా కంకల బుగ్గమ్మ, బండ కేతమ్మ (గుండ్రాంపల్లి), వస్పరి జహంగీర్ (అంతమ్మగూడెం), కొండె మహేష్ (వేలిమినేడు), బాలం జంగయ్య (ఎల్లంబావి) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కాసు గణేష్‌తో పాటు కార్యవర్గ సభ్యులందరికీ పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి సాధించి సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఎన్నికల అధికారి పి. అండాలు సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు.