15 May, 2026 | 11:36 AM

Breaking News

నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో జొన్నల కొనుగోలు ప్రారంభం   •   గన్ని బ్యాగుల కొరత.. పంట తరలింపులో జాప్యం రోడ్డెక్కిన అన్నదాత   •   సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్పష్టత   •   NEET UG 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు   •   మైనర్ బాలికపై లైంగిక దాడి..   •   వాహన దారులకు షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు   •   యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం   •   మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్   •   యువతను వ్యసనాలకు దూరం చేసేందుకే క్రికెట్ టోర్నమెంట్   •   గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలి   •  

అథ్లెటిక్స్‌లో కందనూలు విద్యార్థుల ప్రతిభ

03-11-2025 12:35 AM

నాగర్ కర్నూల్, నవంబర్ 2 (విజయక్రాంతి)నిజాం కాలేజ్లో జరిగిన 35వ దేవేందర్ యాదవ్ మెమోరియల్ రన్2025 అథ్లెటిక్స్ పోటీల్లో నాగర్కర్నూల్ జిల్లా లక్ష్య అథ్లెటిక్స్ కోచింగ్ సెంటర్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు.అండర్10 విభాగం 1 కిలోమీటర్ పరుగులో శ్రీనాథ్, నేహాలు బ్రౌన్ మెడల్స్ సాధించగా, అండర్12 విభాగం 1 కిలోమీటర్లో అభినవ్ రెడ్డి గోల్ మెడల్ గెలిచాడు. అలాగే అండర్15 విభాగం 2 కిలోమీటర్ రన్లో గణేష్ గోల్డ్, విగ్నేష్ బ్రౌన్ మెడల్స్ దక్కించుకున్నారు.

అండర్18 విభాగం 2 కిలోమీటర్లో అజయ్ గోల్డ్, అనిల్ సిల్వర్ మెడల్స్ సాధించారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో కూడా మెరుగైన ఫలితాలు సాధించాలని కోచ్ రానా మల్లేష్ అన్నారు. వీరి విజయం తల్లిదండ్రులు, కోచింగ్ సెంటర్కు గర్వకారణమన్నారు.