6 May, 2026 | 7:57 PM

Breaking News

జిల్లా కోర్టును సందర్శించిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచనరావుకు అభినందనల వెల్లువ   •   పెళ్లి రోజు సందర్భంగా ఎల్లమ్మ, మహంకాళి అమ్మవార్లను దర్శించిన తలసాని దంపతులు   •   జవహర్ నగర్‌లో గృహిణి అదృశ్యం   •   గిరిజన ప్రాంతాలలో అమలు చేస్తున్న కార్యక్రమాల లక్ష్యాలను సాధించాలి   •   శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవానికి ఆహ్వానం అందజేత   •   వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు   •   ఆర్టీసీ సూపర్వైజర్ కాలనీలో ఘనంగా అభయ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టాపన   •   నాగోల్‌లో స్టార్మ్ వాటర్ డ్రెయిన్ నిర్మాణ పనుల వేగం పెంచాలి   •   పెంచిన ధరలను వెంటనే తగ్గించాలి - సిపిఐ   •  

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

22-11-2025 01:55 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, నవంబర్21(విజయక్రాంతి): గత కొన్ని ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ  శుక్రవారం కుమ్రంభీం జిల్లా  కలెక్టర్ వెంకటేష్ ధోత్రే కు వినతి పత్రం అందజేశారు. జర్నలిస్టుల సమస్యలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి. సురేందర్ రావు, పర్వతి రాజశేఖర్ మాట్లాడుతూ.. దీర్ఘకాలికంగా జర్నలిస్టుల ఇండ్లు, ఇండ్ల స్థలాల సమస్య పెండింగ్‌లో ఉందని, గతంలో హెల్త్ కార్డులు ఇచ్చినా అవి ఆసుపత్రులలో అనుమతించడం లేదన్నారు. 

అక్రెడిటేషన్‌ల కాల పరిమితి ముగిసి ఏడాదిన్నర గడిసినా నూత న కార్డులు మంజూరు చేయడం లేదని, కొత్త కార్డులు ఇవ్వాలని, రిటైర్డ్ జర్నలిస్టులకు ఫిం చన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు నీలి సతీష్, ఘనపురం మహేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పుల్లూరి సంతోష్, ఉపాధ్యక్షులు ఏం. రవి, నాయకులు లక్ష్మన్, నాగేందర్, కిరణ్, అబ్దుల్ సమీర్, రాజు పాల్గొన్నారు.