25 April, 2026 | 3:40 PM

జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనిలో చేరండి

25-04-2026 02:04 PM

బోథ్(విజయక్రాంతి): జాబ్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనిలో చేరాలని ఎంపీడీవో రమేష్ ,ఏపీవో జగ్ధిరావును కోరారు. శనివారం మండలంలోని కనుగుట్ట ,కౌట( బిl సాంగ్వి గ్రామాలలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు కూలీలతో వారికున్న సందేహాలను నివృత్తి చేశారు ప్రతి ఒక్కరు ఉపాధి హామీ పనిని పూర్తి చేసుకున్నట్లయితే సకాలంలోనే అందుకు సంబంధించిన కూలి డబ్బులు వస్తాయి అని పేర్కొన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయం పూట పనికి రావాలని సూచించారు. కొలతల ప్రకారం డబ్బులు వస్తాయని ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవన్నారు. వారి వెంట ఆయా గ్రామాల సర్పంచులు ఓరుగంటి స్వామి ,లలిత, ఈసీ మధుకర్ .పీఏ నరేష్ .ఎస్ఏ రాంసింగులు ఉన్నారు.