15 June, 2026 | 7:15 PM

Breaking News

వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •  

జీవో 46 ను రద్దు చేసి ఎన్నికలను వాయిదా వేయాలి

27-11-2025 12:00 AM

ముకరంపుర, నవంబరు 26 (విజయ క్రాంతి): జీవో 46ను రద్దుచేసి ఎన్నికలను వాయిదా వేయాలని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ డిమాం డ్ చేశారు. బుధవారం బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో తెలం గాణ చౌక్ లో ల నాయకులు కళ్ళకి గంతలు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీ నిలబెట్టుకోకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సరికాదన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు.గత సంవత్సర కాలంగా తెలంగాణ ప్రభుత్వం బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో బీసీలని నమ్మించి మోసం చేసిందని ఆ పార్టీకి రాబోవు రోజుల్లో బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసీ పెద్ది శ్రీధర్ రాజ్, రవీంద్ర చారి, ఉమ మహేశ్వర్, నారాల శ్రీకాంత్, దిలీప్, కిశోర్, సందీప్, తదితరులుపాల్గొన్నారు.