7 July, 2026 | 2:57 PM

Breaking News

సుద్దాలలో ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం, మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పత్రాలు అందజేత   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు   •   పదవీ విరమణ సేవలకు మాత్రమే… వ్యక్తిత్వానికి కాదు   •   గోపాల్పేట్ గ్రామంలో నూతన సీసీ రోడ్డు పనులు ప్రారంభం   •   బీజేపీలో భారీ మార్పులకు రంగం సిద్ధం?   •   మరోసారి అవకాశం ఇస్తే.. మరింత అభివృద్ధి చేస్తాం   •   TRS పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టుకు కవిత   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలే లక్ష్యం   •   మార్వాడీ యువ మంచ్ ఆధ్వర్యంలో ఉచిత ఫ్రీజర్ బాక్స్ ప్రారంభం   •  

శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం హేయం

18-01-2026 12:00 AM

మా నేతల అరెస్ట్‌లను ఖండిస్తున్నాం

మాజీ మంత్రి హరీశ్‌రావు

హైదరాబాద్, జనవరి17(విజయక్రాంతి): కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య మే మా ఏడో గ్యారంటీ అని చెప్పిన రేవంత్ రెడ్డి నేడు ప్రశ్నించే గొంతుకలను పోలీసులతో అణచివేస్తూ నిరంకుశత్వమే మా పాలసీ అని నిరూపిస్తున్నారని మాజీ మం త్రి హరీశ్‌రావు విమర్శించారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన కోసం మా పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో జరుగుతున్న శాంతియుత ర్యాలీని అడ్డుకోవడం, కార్యకర్తలను అరెస్టు చేయడం హేయమైన చర్య అని మం డిపడ్డారు. ఈ మేరకు శనివారం ట్విట్టర్ వేదికగా స్పందించిన హరీశ్‌రావు ఈ అరెస్టు లను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పోలీస్ రాజ్యం గా మార్చడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని, మీ నిర్బంధాలకు భయపడేది లేదని స్పష్టం చేశారు. చారిత్రక సికిందరాబాద్ అస్తిత్వం కోసం మా పోరాటం ఆగదని వెల్లడించారు.