ఉప్పల్ మైదానంలో ఐపీఎల్ సందడి— టీమ్లోకి ధోని.. సీఎస్కేకు మరింత క్రేజ్
హైదరాబాద్: ఉప్పల్ మైదానంలో(Uppal Stadium) ఐపీఎల్ మ్యాచ్ సందడి నెలకొంది. రాత్రి 7.30 గంటల నుంచి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్(Chennai Super Kings vs Sunrisers Hyderabad Match) ప్రారంభం కానుంది. స్టేడియంలో చెన్నై, హైదరాబాద్ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఎంఎస్ ధోని జట్టులో చేరడంతో సీఎస్కేకు మరింత క్రేజ్ పెరిగింది.
సన్రైజర్స్ హోంగ్రౌండ్ వేదికగా ఒక మ్యాచ్లో ఓడి.. మరో మ్యాచ్లో గెలిచింది. ఐపీఎల్ మ్యాచ్ దృష్ట్యా ఉప్పల్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధించారు. ఐపీఎల్ మ్యాచ్ కోసం ఉప్పల్ లో 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియం వద్ద 430 సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. మ్యాచ్ కు వచ్చే వారి కోసం 11 పార్కింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్టేడియంలోకి ల్యాప్ ట్యాప్ లు, బ్యాగులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు నిషేధించారు. ఐపీఎల్ మ్యాచ్ దృష్ట్యా శనివారం అర్ధరాత్రి వరకు మెట్రోరైలు సర్వీసులు అందుబాటులో ఉంచారు.






