నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చెయ్యాలి: దుర్గం దినకర్
వాంకిడి,(విజయక్రాంతి): వాంకిడి మండలం ఖీర్డి గ్రామంలో నూతన ట్రాన్స్ఫారం ఏర్పాటు చేయాలని, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దుర్గం దినకర్ అన్నారు. ఖీర్డి గ్రామంలోని రామ్మందిర్ వాడలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో వారం రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నూతన ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేసి వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని శనివారం గ్రామస్తులతో కలిసి వాంకిడి మండల కేంద్రంలోని విద్యుత్ శాఖ సబ్ ఇంజనీర్ శరత్ చంద్రకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నపిల్లలు, వృద్ధులు చీకట్లో ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన సబ్ ఇంజనీర్ శరత్ చంద్ర నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.






